Birthday Puja New Delhi (India)

పుట్టినరోజు పూజ, న్యూ డిల్లీ (ఇండియా), 21 మార్చి 2004. [శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]మీరందరూ ఇంత గొప్ప ప్రేమ మరియు గౌరవంతో నాకు స్వాగతం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. [శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]ఈ రోజు నాకు ఇంత హృదయపూర్వక స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఏ పదాలు ఉపయోగించాలో నాకు తెలియట్లేదు . [శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]ఈ రోజు ప్రతి క్షణం నేను ఆనందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అందరికీ నేను ఏమి చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ మరియు గౌరవం నా బలానికి మించినవి, నా నిరీక్షణకు మించినవి. మీరందరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కాలేదు, మీ అందరి కోసం నేను ఏమి చేశానో నాకు తెలియదు, మీరందరూ కావాలని కోరుకున్నది , మీకు లభించినది. నేను మీ అందరి కోసం ఏమీ చేయలేదు. [శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]మీరందరూ స్వాగతించిన తీరు చూసి నాకు అమితమైన సంతోషం కలిగింది  మరియు మీరు సంతోషం మరియు పరమానందంతో పాటలు పాడుతున్నారు. నాకు ఎలా వ్యక్తపరచాలో తెలియటంలేదు, ఎందుకంటే నాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను మరియు మీ ప్రశంసలకు ఏమి చెప్పాలో తెలియటంలేదు, మీరు సహజయోగం చాలా సులభంగా తీసుకున్నారు మరియు దానిని సమీకరించారు.ఏది ఏమైనా, ఇది చాలా పరస్పర ప్రశంసించుకునే సమాజం, మనం ఒకరినొకరు ఆనందిస్తున్నామని చెప్పాలి.భగవంతుడు ఈ సంతోషం మరియు పరమానందం మరియు దైవంతో సంపూర్ణ ఐక్యతతో మీ అందరికీ ఆశీర్వదించాలి. మీకు చాలా ధన్యవాదాలు, ధన్యవాదాలు.[చప్పట్లు]ధన్యవాదాలు.[చప్పట్లు]ఇప్పుడు వారు మీ వినోదం కోసం కొంత సంగీతాన్ని ఏర్పాటు చేశారు, అందువల్ల నేను వారిని నిర్వహించమని చేసుకోమని అడుగుతాను…ధన్యవాదాలు.

Birthday Puja: Sincerity Curzon Hall, Sydney (Australia)

 మిమ్మల్ని చూసుకోవటానికి, మీ కోసం శ్రద్ధ వహించడానికి మరియు చాలా జ్ఞానంతో మిమ్మల్ని మార్చగలిగే తల్లి మీకు అవసరం. సహజయోగులు కూడా వారి హృదయాలను విస్తరించుకుంటూ, వారు ఇక నీటి బిందువులు కాదని,  సముద్రంలో భాగం అని వారు గ్రహిస్తున్నట్లు నేను తెలుసుకుంటున్నాను. ఆ సముద్రమే వారిని బలోపేతం చేస్తూ, పోషిస్తూ వారిని చూసుకుంటుంది. అదే సముద్రం వారికి మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ నీటిబిందువులు మరియు సముద్రం యొక్క అనుసంధానం పూర్తిగా ఏర్పడాలి. అప్పుడు నీటి బిందువు యొక్క పరిమితులు సముద్రం యొక్క గొప్పతనంలో పూర్తిగా కరిగిపోతాయి. ముందుగా, సమిష్టి( కలెక్టివిటీ) గా ఉండాలనే నిజమైన కోరిక, శ్రద్ధ మరియు మంచి విషయాలు చెప్పటం ద్వారా సమిష్టి ని మెరుగుపరచవచ్చు. సమిష్టిగా ఉండాలి అన్న కోరిక నిజాయితీగా ఉండాలి. ఇది మీ ఉనికి యొక్క విస్తరణకు సహాయపడుతుంది. మొదట కావలసింది మీకు మీరు నిజాయితీగా ఉండటం. మనం చిన్న నీటిబిందువు నుంచి రావటంవల్ల మళ్ళా మళ్ళా ఆ బిందువు యొక్క పరిమితుల్లోనే ఉండిపోతామనుకోండి, కానీ మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారనే ముందు చూపు ఉండాలి. అందువల్ల మీరు సమిష్టిగా ఉండాలనుకుంటున్న ఆలోచనకు చిత్తశుద్ధి/నిజాయితి అన్ని అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. మీరు గనక ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవటానికి నిజాయితీగా ప్రయతిస్తున్నట్లైతే  సమయాన్ని, రోజుని మరియు అన్నీ మరిచిపోతారు. అవి చిన్నవి అయినా మీరు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారు. ఇప్పుడు మీకు ఆ నిజాయితీ ఎక్కడ నుంచి వస్తుంది? నిజాయితీని ఆచరణలో పెట్టాలంటే రెండు విషయాలున్నాయి. మొదట మీకు మీరుగా తెలుసుకోవలసినది – సహజయోగా అంటే ఏమిటి? సహజయోగ మీకు ఏమి ఇచ్చింది? సహజయోగ మీకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చింది, విస్తృతమైన దృష్టిని ఇచ్చింది, సామూహిక చైతన్యాన్ని ఇచ్చింది, ఆలోచనారహిత స్థితికి ఇచ్చింది, నిస్సందేహస్థితిని ఇచ్చింది, మీ నుండి కొత్త వ్యక్తిత్వాన్ని సృష్టించింది. సరిగ్గా గ్రుడ్డు పక్షిగా మారినట్లు. ఇప్పుడు మీరు పక్షి అయినారు. సహజయోగ మీకోసం ఏమి చేసిందో, దానితో మీరు ఏమి సాధించారో గ్రహించాక, మరలా గ్రుడ్డు స్థితికి మీరు వెళ్ళలేరు.       మీరు జ్ఞానాన్ని సాధించారు. కుండలిని జ్ఞానం. ఈ జ్ఞానం ఇన్ని సంవత్సరాలుగా రహస్యంగా ఉంచబడింది. ఇది ఖచ్చితంగా రహస్య జ్ఞానం. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇంతవరకు కాల గర్భంలో దాగి ఉంది. ఏ పాఠశాలకు, కళాశాలకు మరెక్కడికైనా వెళ్లకుండానే  కుండలిని గురించిన జ్ఞానం మీ వద్ద స్పష్టంగా ఉంది. Read More …

Paramchaitanya Puja Taufkirchen (Germany)

ఈ రోజు మనం ఏ పూజ చేయబోతున్నాం అని నన్ను అడిగారు. నేను దానిని రహస్యంగా ఉంచాను. ఈ రోజు మనం పరమ చైతన్యమును ఆరాధించాలి. అదే అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క ప్రేమ. పరమ చైతన్యము దయతో ప్రతిదీ పనిచేస్తుందని మనందరికీ తెలుసు, కనీసం మానసికంగా అయినా తెలుసు. ఇదే ఆదిశక్తి యొక్క శక్తి. కానీ ఇప్పటికీ ఈ విషయం మన హృదయంలో గానీ, మన ధ్యాసలో కానీ అనుకున్నంతగా లేదు. ఒక మహా సముద్రము వలె పరమ చైతన్యము అంతటినీ తనలో కలిగి ఉన్నది. ప్రతిదానికి, పని చేసే ప్రతీ దానికీ స్వంత పరిమితులు ఉంటాయి. అందువలన పరమ చైతన్యమును దేనితోనూ పోల్చలేము. సూర్యుడిని గమనిస్తే, కొన్ని పనులు జరగాలంటే సూర్యుడి ద్వారా వర్షాలు రావాలి. అధికారంలో ఉన్న ఒక వ్యక్తిని గనక మీరు చూస్తే, బయటికి అతను తన అధికారాన్ని/శక్తిని చూపించాలి.  కానీ అతను లోపల అలా అధికారాన్ని చూపించడు. ఉదాహరణకి ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనం లో ఒక వృక్షం పెరుగుతుంది, ఫలాలు వస్తాయి, వాటిని అమ్ముతారు, ప్రజలు వాటిని తింటారు. ఇదంతా ఆ విత్తనంలో ఉన్నది. అదే పరమ చైతన్యము.  మనందరం అందులోనే నిబిడీకృతం అయి ఉన్నాము. మనం చూసేది అలలను మాత్రమే. మనం ఆ అలలమీద ఉన్నట్లు చూస్తే, స్థానభ్రంశం చెందినట్లుగా, వేరు చేయబడినట్లుగా కనిపిస్తుంది. సరిగ్గా, ఇది జర్మనీ, ఇది ఇంగ్లాండ్, ఇది భారత దేశం అని మనం భావిస్తున్నట్లే ఉంటుంది. ఇవి పరమ చైతన్యపు చీర యొక్క మడతలు. అవి బయటికి వేరుగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అవి వేరుగా లేవు, అవి అన్నీ కలిసే ఉన్నాయి. అందువలన అవి ఖచ్చితంగా పూర్తిగా అనుసంధానించబడి ఉన్నాయి.  నేను గనక ఒక దారపు పోగును చీర నుండి లాగితే, మొత్తం దారపు పోగు చీర నుంచి లాగివేయబడుతుంది. అలాగే పరమ చైతన్యం తనలో తానే పనిచేస్తుంది. పరమ చైతన్యం లేకుండా ఏమీ లేదు. అందువలన సహజయోగులైన మీ మీద పరమ చైతన్యం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.  లేదా అది  మీతో ఖచ్చితంగా మమేకం అవుతుంది అని చెప్పాలి. మీరు పరమచైతన్యంతో మమేకం అయినప్పుడు  మీరు ఏది కోరుకున్నా, ఏది కావాలనుకున్నా అది కూడా పరమచైతన్యం నుండే లభిస్తుంది. అల్ల కల్లోలంగా ఉన్న సముద్రంలో కొన్ని నీటి బిందువులు గాలిలోకి ఎగిరి అవి సముద్రముకంటె పైన Read More …

Talk, Eve of Shri Vishnumaya Puja YWCA Camp, Pawling (United States)

ప్రశ్న : శ్రీమాతాజీ, మాలో చాలామందికి హంస చక్రం గురించి తెలియదు, హంస చక్రంకు మరియు విశుద్ధికి గల సంబంధం మరియు విశుద్ధి చక్రమును బలోపేతం చేయడానికి మేము ఏమి చెయ్యాలో వివరించండి.శ్రీమాతాజీ : హంస చక్రం, విశుద్ధి చక్రానికి మరియు ఆజ్ఞా చక్రానికి మధ్య ఉండడం మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. విశుద్ధి నుంచి చాలా నరాలు హంస దగ్గర ఆగిపోతాయి, అవి మెదడు వరకు వెళ్లవు. ఇక్కడ మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలుగా పిలవబడే ప్రతిచర్యలన్నీ ఆగిపోతాయి. నాకు మురికి వాసన వచ్చిందనుకోండి ముక్కు మూసుకుంటాను, వినకూడనిది వింటే చెవులు లాగుతాను, ఏదైనా చూడకూడనిది చుస్తే నా కళ్ళు వాటికవే మూసుకుంటాయి. ఎవరైనా సూదితో/పిన్నుతో గుచ్ఛటానికి దగ్గరకి తేగానే ఆకస్మికంగా నేను నా చేతిని వెనక్కి తేసేస్కుంటాను. ఇవ్వనీ నా శరీర వ్యవస్థలోనే నిర్మించబడ్డాయి. మీరు కూడా మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలతోనే ప్రతిస్పందిస్తారు.                                  జంతువులు వేరు, జంతువులకు ఇలాగే జరగకపోవచ్చు, కొన్ని జంతువులకు కొన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉన్నాయి, మరికొన్ని జంతువులకు వేరేవి ఉన్నాయి. మనము వేరు, మనందరికీ దాదాపు ఈ చర్యలన్నీ ఒకేలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు, అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. వారి వారి నియమాల ప్రకారం ఒకరు “యాహ్” అంటారు, మరొకరు “ఓహ్” అంటారు, మరొకరు మరొకవిధంగా అనవచ్చు. కానీ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఒకేవిధంగా ఉంటాయి.              కాబట్టి అసంకల్పిత ప్రతీకార చర్యలకు మనం విచక్షణను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైతే రెండు నాడులు కలుస్తున్నాయో, ఆ కలిసే చోటును ఉపయోగించుకుంటున్నప్పుడు ఆజ్ఞాకి వెళ్లకుండా హంస చక్రం యొక్క పని(విచక్షణ) మొదలవుతుంది. అందువలన ఈ రెండు నాడులు కలిసినప్పుడు మన అనుభవాల ద్వారా పరిస్థితిని చూడటం ప్రారంభిస్తాము. మొదటిది స్వాంచాలికమైన ప్రతిచర్య, రెండవది అనుభవాల ద్వారా చూడటం : ఒక పిల్లవాడిని  “ఇక్కడ వేడిగా ఉంది నువ్వు చెయ్యి పెట్టవద్దు” అని అన్నారనుకోండి, వినడు. పిల్లవాడిని ఆలా వదిలేస్తే, కాలినప్పుడు అతని అనుభవం ద్వారా ప్రతిచర్యలు మరియు వాటి నియమ నిబంధనలు/కండీషనింగ్స్ వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి ప్రతిచర్యలు మనలో నిర్మింపబడతాయి. మీరు గమనించినట్లయితే, జాతి వివక్ష ఉన్న దేశానికి లేదా Read More …

Enjoying The Joy San Diego (United States)

మానవాతీత అవగాహన  : ఇంత ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి…ఇలా జరుగుతూ ఉంటుంది, ఎం జరిగినా మనం అంగీకరించాలి, దైవం అలా జరిపిస్తుంటుంది. ప్రతిదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు, మనలో ఏ శక్తి కేంద్రాలున్నాయో వారు మీకు వివరించగలిగుండాలి, మరియు మనలో వాటి నిర్మాణం/పనిచేసే విధానం ఎలా ఉన్నదో అతను మీకు వివరించారు. ఇవన్నీ మన పరిణామం యొక్క వివిధ కాలాల్లో నిర్మించబడ్డాయి. ప్రతీ శక్తి కేంద్రం అలానే నిర్మింపబడింది.                                        ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మార్గం వలే నిర్మింపబడ్డాయి. ఎడమ మరియు కుడి  మార్గాల ద్వారా మీరు మీ ఉన్నతికి కావాలసిన మధ్య మార్గమును సృష్టిస్తారు. మీ శుద్ధ ఇచ్ఛ యొక్క శక్తి ఉద్దానం అయ్యి, జాగృతి చెంది, ఏడవ శక్తి కేంద్రం నుంచీ చొచ్చుకుని పోతుంది, దాన్నే సహస్రారం అంటాము, అంటే, వెయ్యి రేకుల శక్తి కేంద్రం – మెదడు, లేదా మెదడులో లింబిక్ ని కప్పే కొంత భాగం. పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ . అది మన హృదయంలో నివసిస్తుంది. ఎప్పుడైతే కుండలిని ఆత్మయొక్క పీఠమైన సహస్రారాన్ని తాకుతుందో, అది హృదయంలో ప్రతిబింభించి, జ్ఞానోదయం పొందుతుంది. దీని అర్థం ఆత్మ జ్ఞానోదయం పొందుతుందని అర్థం కాదు.  ధ్యాస అన్నది ఒక చీర లాంటిది, అది పైకి ఇలా (శ్రీమాతాజీ వీడియోలో చూపిస్తారు) నెట్టివేయబడి, తాకి, సహస్రారంలో పీఠం కలిగిన, హృదయంలో ఉన్న ఆత్మను ప్రభావితం చేసి మన కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించటం మొదలుపెడుతుంది.                            కాబట్టి, మీ తలపై చల్లటి గాలి రావటమనేది మీకు కలిగే మొదటి అనుభూతి. మీకు కలిగే రెండవ అనుభూతి: సర్వ వ్యాపకమైన శక్తి, అదే పరమ చైతన్యం. ఇప్పుడు మీరు మీ అవగాహన యొక్క సూక్ష్మ స్థితిలోకి ప్రవేశించారు. మొదట మానవ అవగాహన పెరుగుతుంది, కానీ ఎప్పుడైతే మీరు మీ ఆత్మను తాకుతారో/తెలుసుకుంటారో, ఆలోచనా రహితమైన అవగాహనను పొందుతారు. కానీ ఆలోచన ఉండదు, స్థూలం/భౌతికం పోతుంది, ఆలోచనలు మాయమవుతాయి. మీరు సూక్ష్మంగా మారతారు. ఈ సూక్ష్మత మీకు కొన్ని శక్తులను ఇస్తుంది. మీ అవగాహన సమిష్టి స్పృహలోకి Read More …

Nabhi Chakra (England)

నాభి చక్రం. ఫిబ్రవరి 1977. ఈ ప్రసంగం భారతదేశంలో పాశ్చాత్య యోగుల మొదటి భారత పర్యటన (జనవరి–మార్చి1977) సందర్భంగా ఇవ్వబడింది. ఖచ్చితమైన స్థానం తెలియదు. నాభి చక్రం, ప్రతి మనిషి యొక్క గురుత్వాకర్షణ కేంద్రంలో ఉంచబడింది. అది ఆ స్థానంలో లేనట్లయితే దానిని సరైన స్థానంలోనికి తిరిగి తీసుకురావడం మీకో చిన్న సమస్య కావచ్చు. మీలో చాలా మంది ఒక రకమైన ఇబ్బందితో బాధపడుతున్నారు.అది మాదక ద్రవ్యాల వల్ల కావచ్చు లేదా నరాల సమస్యల వల్ల కావచ్చు, యుద్ధం వల్ల కావొచ్చు లేదా జీవనంలో కలిగిన ఆకస్మిక పరిణామాల వల్ల కావచ్చు. ఉదాహరణకు, యుద్ధ సమయంలో ప్రజలు తమ విలువలను కోల్పోయారు, ఎందుకంటే వారు భగవంతునిపై విశ్వాసం కోల్పోయారు. పవిత్రతను నమ్ముకున్న పవిత్రమైన మహిళలు క్రూరంగా బలాత్కరించబడ్డారు. అమిత భక్తికల వ్యక్తులు హింసించబడ్డారు, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి, చాలా మంది పురుషులు చంపబడ్డారు, పిల్లలు,మహిళలు మరియు వృద్ధులు చెల్లాచెదురైపోయారు. చాలా భయంకరమైన అభద్రతా వాతావరణం ఈ దేశాలన్నింటినీ అధిగమించింది. ఆ తర్వాత కాన్సంట్రేషన్ క్యాంపులు/ఏకాగ్రతా శిబిరాలు వచ్చాయి. ఇవి కూడా మనుషులను ఛిన్నాభిన్నం చేశాయి, ఎందుకంటే మనుషులు చాలా సున్నితమైన సాధనాలు. వారు ప్రతిష్టాత్మకమైన సృష్టి, వారు అత్యున్నతమైన కలిగిన వారు. వారు బాంబుల వంటి భౌతికమైన వాటిచే ఆధిపత్యం చెలాయించబడ్డారు. ఆ విధంగా, మనిషిలోని ఆత్మ చనిపోయింది.ప్రజలు ధర్మం మీద, ప్రేమ మీద నమ్మకం కోల్పోయారు. అప్పుడు భద్రత యొక్క కొత్త కార్య ప్రణాళిక నిర్మించబడింది. పారిశ్రామిక విప్లవం దానిని అనుసరించింది. ఫలితంగా ఆనందం,భద్రత, ప్రేమ యొక్క కృత్రిమ భావనను సమాజం అంగీకరించింది. మనిషి తన స్వేచ్ఛతో ఈ విధంగా చేసాడు. ఎందుకంటే యుద్ధాలు మానవునిచే సృష్టించబడ్డాయి గానీ భగవంతుడు చేయలేదు. కానీ దానితో పాటు, చాలా ఉన్నతమైన ఆత్మలు ఈ భువిపై జన్మను తీసుకున్నారు. వారు భౌతికవాదం/భౌతికమైన వాటి వంటి ఈ కృత్రిమ భద్రతకు మించి అన్వేషించడం ప్రారంభించారు. సాధకులకు సంఘటితం/కార్య నిర్వహణ/organize చేయడానికి మరియు వారిని సరైన మార్గంలో నడిపించడానికి యోగ్యమైన నాయకులు లేరు. అందువలన వారు చేసిన పొరపాట్లు అవరోధం కలిగించాయి. కాబట్టి, మానవ అవగాహన యొక్క అడ్డంకులే కాకుండా, అనేక ఇతర అడ్డంకులు జోడించబడ్డాయి. ఇతరత్రా చాలా అడ్డంకులు జోడించబడ్డాయి, ఇవి వారికి సహజ యోగంను కష్టమైన ప్రక్రియగా/పధ్ధతిగా/process చేసింది. ఏ ఏ దేశాలైతే యుద్ధంలో పాల్గొన్నాయో అవి మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. ప్రతి చర్యగా, అవును ప్రతి చర్యే,ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో, వారు మాత్రమే అభివృద్ధి చెందిన వ్యక్తులు, లేని వారు అభివృద్ధి చెందని వారు. అందువలన ఒక పక్క అధిక అభివృద్ధిని కలిగిన దేశాలు అన్వేషణకు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అవి సుసంపన్నమైన దేశాలు. కానీ ఆ దేశపు అన్వేషకులు వ్యతిరేక భావాల కారణంగా వారి మూలాలను కోల్పోయారు. మరొక పక్క అభివృద్ధి చెందని దేశాలు:అందువలన అక్కడ వారు ఇంకా ధనం కొరకు అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో, సహజ యోగం కనుగొనబడింది, ఈ వేదిక ద్వారా, భగవంతునితో Read More …